సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలు గ్రామాల్లో కలియతిరిగారు. మిరుదొడ్డి నుంచి చేగుంట

సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలు గ్రామాల్లో కలియతిరిగారు. మిరుదొడ్డి నుంచి చేగుంట వెళ్లే మార్గంలో ఖాజీపూర్‌లో పర్యటించిన హరీష్ రావు.. అక్కడి మహిళలతో కాసేపు ముచ్చించారు. ఇంటి అరుగులపై కూర్చొని బీడీలు చుడుతున్న మహిళల వద్దకు వెళ్లిన హరీష్ రావు వారితో మాట కలిపారు. సరదాగా కాసేపు మాట్లాడిన ఆయన.. ఆ మహిళలను ‘అమ్మ మీరు ఇన్ని సంవత్సరాల నుండి బీడీలు చుడుతూనే ఉన్నారు కానీ ఏ ప్రభుత్వమైనా మీకు, బీడీ కార్మికులకు పింఛను ఇచ్చిందా?’ అంటూ అడిగారు. ఇలా కాసేపు వారితో ముచ్చటించి బీడీలు చుడుతున్న అక్క, చెల్లెమ్మల ఆర్థిక స్థితిగతులు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు మంత్రి. ఇక మంత్రి హరీష్ రావు రాకతో సంబరపడిపోయిన మహిళలు.. సంతోషంగా మాట్లాడారు. సరదాగా, సంతోషంగా పాత ముచ్చట్లను నెమరు వేసుకున్నారు.

మంత్రి హరీష్‌రావు ఇలాకాలో టీఆర్‌ఎస్‌, బీజేపీ శ్రేణులు బాహాబాహీకి దిగాయ్‌. సిద్దిపేట జిల్లా అక్బర్‌పేట్‌-భూంపల్లి మండలంలో కొట్లాటకు దిగారు రెండు పార్టీల కార్యకర్తలు. మంత్రి హరీష్‌రావు ముందే ఈ రగడ జరిగింది. డీసీసీబీ బ్యాంక్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీ ఈ వివాదానికి కారణమైంది. డీసీసీబీ బ్యాంక్‌ ప్రారంభోత్సవానికి మంత్రి హరీష్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితోపాటు స్థానిక ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు అటెండ్‌ అయ్యారు. అయితే, బ్యాంకు దగ్గర ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఫొటో లేకపోవడంతో బీజేపీ కేడర్‌ అభ్యంతరం తెలిపింది. ఎందుకు, రఘునందన్‌ ఫొటో వేయలేదంటూ గొడవకు దిగడంతో కాషాయ పార్టీ కార్యకర్తలు.